రూ.3,04,965 కోట్లతో తెలంగాణ బడ్జెట్

తెలంగాణ శాసనసభలో బుధవారం రాష్ట్ర బడ్జెట్ ను డిప్యూటీ సీఎం,ఆర్ధిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. 2025-26 ఏడాదికి రూ.3,04,965 కోట్లతో బడ్జెట్ శాసనసభకు సమర్పిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు, మూలధన వ్యయం రూ. 36,504 కోట్లుగా పేర్కొన్నారు. అలాగే ద్రవ్యలోటు రూ.54,009 కోట్లు, రెవెన్యూ మిగులు రూ.2,738 కోట్లుగా ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. బడ్జెట్ లోవివిధ రంగాలకు కేటాయింపులు ఇలా.. పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ- రూ.31,605 కోట్లు వ్యవసాయశాఖ- రూ 24,439 కోట్లు విద్యాశాఖ- రూ.23,108 కోట్లు ఎస్సీ...

భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు వస్తాయి : సీఎం రేవంత్ రెడ్డి

ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున బలంగా వాదనలు వినిపించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపిన సందర్భంగా ఆయా సంఘాల నేతలు సీఎంకు ధన్యవాదములు తెలిపారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పదేళ్లలో పరిష్కారం కాని సమస్యకు మేం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే పరిష్కారం చూపామన్నారు. భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు ఉండకూడదనే వన్ మెన్ కమిషన్ ఏర్పాటు చేశామని సీఎం పేర్కొన్నారు. వందేళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా,...

పంటలు ఎండిపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం : కేటీఆర్

ఎండిన వరితో బుధవారం శాసనసభ ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆందోళన చేశారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. రైతుల పట్ల, రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత మర్చిపోయింది కాబట్టే పంటలు ఎండిపోతున్నాయని కేటీఆర్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పంటలు ఎండుతున్నాయంటే.. ముందుచూపు లేని ఈ ప్రభుత్వమే కారణం అని పేర్కొన్నారు. కేసీఆర్ మీద కోపంతో రాష్ట్ర సర్కారు మేడిగడ్డను ఎండబెట్టడం వలన రైతన్నలకు ఇబ్బంది అవుతున్నదని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిపోయిన...

వర్గీకరణ ఉద్యమంలో మృతిచెందిన వారి కుటుంబాలను ఆదుకుంటాం :సీఎం రేవంత్ రెడ్డి

ఎన్నో ఏళ్ల ఎస్సీ వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్న చారిత్రాత్మకమైన సందర్భమని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అన్నారు. శాసనసభలో ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సుదీర్ఘమైన వర్గీకరణ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు.  చనిపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుందని తెలిపారు. వారి కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం పథకాల్లో ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. దళితులకు అండగా ఉంటూ వారి అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందిని పేర్కొన్నారు. బిల్లు...

ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఉభయ సభల ఆమోదం

తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసేందుకు రాష్ట్ర  సర్కారు ప్రవేశపెట్టిన బిల్లుకు మంగళవారం అసెంబ్లీ, శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. ఎస్సీలోని 59 ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-1లోని 15 కులాలకు 1శాతం , గ్రూప్-2లోని 18 కులాలకు  9 శాతం, గ్రూప్-3లోని 26 కులాలకు 5 శాతం రిజర్వేషన్ కల్పించారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన 7 నెలలోనే రాష్ట్ర ప్రభుత్వం శాసన ప్రక్రియను పూర్తి చేసింది.

 కులగణన చరిత్రలో ఒక మైలు రాయిగా నిలుస్తుంది: సీఎం రేవంత్ రెడ్డి

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు జరిగే పోరాటానికి ముందుండి నాయకత్వం వహిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో  42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును శాసనసభ ఆమోదించిన నేపథ్యంలో రాష్ట్రంలోని బీసీ సంఘాలు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో సీఎం ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా, నిబద్ధతతో నిర్వహించిన కుల సర్వేను తప్పుబడితే బీసీలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని విడమరిచి చెప్పారు. బలహీన వర్గాలు తమ హక్కుల సాధన కోసం...

వేములవాడ ఆలయానికి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలి: హరీష్ రావు

దేవాదాయ చట్ట సవరణ బిల్లుపై మంగళవారం శాసనసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 100 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం ఉన్న దేవాలయాలకు ట్రస్ట్ బోర్డ్ ఏర్పాటు చేసే వెసులుబాటును కల్పించామని బిల్లులో చెప్పారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ ఆలయానికి రూ.127 కోట్లకు పైగా ఆదాయం వస్తోందన్నారు. కాబట్టి వేములవాడ దేవస్థానానికి కూడా ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలని హరీష్ రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

యాదగిరిగుట్ట దేవస్థానానికి పాలక మండలి: మంత్రి కొండా సురేఖ

యాదగిరిగుట్ట దేవస్థానానికి పాలక మండలిని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మంగళవారం అసెంబ్లీలో  తెలిపారు. వైటీడీ బోర్డులో 18 మంది సభ్యులు ఉంటారన్నారు. సభ్యుల పదవీ కాలం రెండు సంవత్సరాలు. అలాగే వీరికి జీతాభత్యాలు ఉండవని పేర్కొన్నారు. కేవలం డీఏలు మాత్రమే ఉంటాయని మంత్రి కొండా సురేఖ తెలిపారు.

కేంద్ర రైల్వే మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ

చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని విజ్ఞప్తి చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి కేంద్రరైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు సోమవారం రాత్రి లేఖ రాశారు. దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పునాది వేసిన పొట్టి శ్రీరాములు త్యాగాలను స్మరిస్తూ చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు వారి పేరును పెట్టాలని తెలంగాణ ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నామని ముఖ్యమంత్రి ఆ లేఖలో పేర్కొన్నారు.

నిజమైన నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరాలి: సీఎం రేవంత్ రెడ్డి

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగ యువతీ యువకులకు ఆర్థిక సహాయం అందించడానికి ఉద్దేశించిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని సోమవారం శాసనసభ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 6 వేల కోట్ల రూపాయలతో 5లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని సీఎం తెలిపారు. నైపుణ్యం ఉండీ ఉద్యోగం లభించని యువతకు ఈ పథకం కింద ప్రాధాన్యత కల్పించాలన్నారు. స్వయం ఉపాధి కింద అసలైన, అర్హులైన నిరుద్యోగ యువతీ,...