ఇటీవల ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని అందుకున్న భారత క్రికెట్ జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. టీం ఇండియాకు రూ.58 కోట్ల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు బీసీసీఐ పేర్కొంది. అలాగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకున్నందుకు ఐసీసీ నుంచి భారత క్రికెట్ జట్టుకు రూ.19.50 కోట్ల వరకు ప్రైజ్ మనీ లభించిన సంగతి తెలిసిందే.