తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, కె.శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మరో ఎమ్మెల్సీ స్థానాన్ని సీపీఐకి కేటాయించినట్లు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు.