Home జాతీయం & అంతర్జాతీయం మంత్రి లోకేష్ తో సమావేశమైన ఢిల్లీ పరిశ్రమల శాఖ మంత్రి

మంత్రి లోకేష్ తో సమావేశమైన ఢిల్లీ పరిశ్రమల శాఖ మంత్రి

VGన్యూస్: ఢిల్లీ ప‌రిశ్రమ‌లు, అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి స‌ర్దార్ మ‌న్‌జింద‌ర్ సింగ్ శిర్సా నేతృత్వంలో ఆ ప్రభుత్వానికి చెందిన ప్రత్యేక ప్రతినిధుల బృందం ఏపీ సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్)లో రాష్ట్ర పరిశ్రమల శాఖ అధికారులతో ఈ బృందం మంగ‌ళ‌వారం స‌మావేశ‌మైంది. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, ప‌రిశ్రమ‌ల శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్‌లు ఏపీ ప్రభుత్వం అమ‌లు చేస్తున్న పారిశ్రామిక విధానం గురించి వివ‌రించారు. పెట్టుబ‌డుల ఆక‌ర్షణ‌, పారిశ్రామిక విధానాల రూప‌క‌ల్పన‌, డేటా డ్రివ‌న్ గ‌వ‌ర్నెన్స్ అమ‌లు, స్మార్ట్ గ‌వ‌ర్నెన్స్ త‌దిత‌ర అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికున్న అపార అనుభ‌వంతో ఢిల్లీ ప్రభుత్వానికి స‌హ‌కారం అందించాల‌ని కోరగా తాము పూర్తి స‌హ‌కారం అందించ‌డానికి సిద్ధంగా ఉన్నామ‌ని మంత్రి లోకేష్ చెప్పారు.