చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని విజ్ఞప్తి చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి కేంద్రరైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు సోమవారం రాత్రి లేఖ రాశారు. దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పునాది వేసిన పొట్టి శ్రీరాములు త్యాగాలను స్మరిస్తూ చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు వారి పేరును పెట్టాలని తెలంగాణ ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నామని ముఖ్యమంత్రి ఆ లేఖలో పేర్కొన్నారు.