Home తాజా వార్తలు  బిల్డ్‌నౌ పోర్టల్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

 బిల్డ్‌నౌ పోర్టల్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

గత పదేళ్ల కాలంలో బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఉత్పన్నమైన సమస్యలను తమ ప్రభుత్వం  ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన బిల్డ్‌నౌ పోర్టల్‌ను  సీఎం ప్రారంభించారు . ఈసందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పూర్తి పారదర్శకంగా భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులకు ఆన్‌లైన్ ద్వారా అందించాలన్న ఉద్దేశంతో ఈ పోర్టల్ తీసుకొచ్చినట్టు చెప్పారు. ఇప్పుడు పేదోడు, పెద్దోడు అన్న తేడా లేదు. అందరూ పబ్లిక్ డొమైన్‌లో దరఖాస్తు చేసుకోవలసిందేనని సీఎం స్పష్టం చేశారు. అనంతరం నగరంలో ఇంటి నిర్మాణం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న ముగ్గురికి ఈ సందర్భంగా అనుమతి పత్రాలను అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here