VGన్యూస్: ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్తో సియోల్లో దక్షిణ కొరియా భారత రాయబారి గౌరంగలాల్ దాస్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. శాంసంగ్, ఎల్జీ, ఎస్కె, ఏఎస్ఐపీ–ఏపీఏసీటీ ఓశాట్ల ఆధారంగా, ఇండియా సెమీకండక్టర్ మిషన్, ఏపీ ఎలక్ట్రానిక్స్ పాలసీ 4.0కు అనుగుణంగా కొరియన్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు, చిప్ దిగ్గజాలను ఏపీకి రప్పించేందుకు సహకారం అందించాలని కోరారు.










