VGన్యూస్: నైతిక విలువలు, సిద్ధాంత నిబద్ధతతో రాజకీయ ప్రస్థానాన్ని సాగించిన నాయకుడు కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్, రోహిన్ రెడ్డితో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.







