డీలిమిటేషన్ పై డీఎంకే  సమావేశం… బీఆర్ఎస్ కు ఆహ్వానం…

నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు వాటిల్లే నష్టాలపై చర్చించేందుకు తలపెట్టిన సమావేశానికి రావాలని బీఆర్ఎస్ పార్టీని తమిళనాడు ప్రభుత్వం ఆహ్వానించింది. గురువారం హైదరాబాద్ లో భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను తమిళనాడు మంత్రి నెహ్రూ, ఎంపీ ఇలంగో  కలిశారు. డీలిమిటేషన్ పై మార్చి 22న జరిగే సమావేశానికి రావాలని కేటీఆర్ ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మట్లాడుతూ.. డీలిమిటేషన్ మీద దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా పోరాడాలన్నారు. "తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సమష్టిగా పోరాడినట్లయితే తప్పకుండా దక్షిణాది రాష్ట్రాలకు...

ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్

                                                                                                                       ...

విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దాల్సిన బాధ్యత అధ్యాపకులదే : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో నిరుద్యోగుల పాత్ర చాలా క్రియాశీలకమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన “ప్రజా ప్రభుత్వంలో కొలువుల పండుగ” కార్యక్రమానికి మఖ్యఅతిథిగా సీఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ కళాశాలలో లెక్చరర్ల ఉద్యోగాలకు ఎంపికైన 1532 మంది అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  నియామక పత్రాలు అందజేశారు. ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులందరికీ సీఎం అభినందనలు తెలియజేశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో అందరూ కంకణబద్ధులై పనిచేయాలిని సూచించారు. దేశ భవిష్యత్తు విద్యా...

ఈనెల 27 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈనెల 27 వరకు శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈనెల 19న తెలంగాణ బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం వీసీగా ఆచార్య శ్రీనివాస్

సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి వైస్‌ఛాన్సలర్‌గా ప్రొఫెసర్‌ వై.ఎల్‌. శ్రీనివాస్‌ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ ప్రజల కలల సాకారానికే ఈ బడ్జెట్: గవర్నర్

తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉభయ సభలనుద్దెశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. తెలంగాణ ప్రజల కలల సాకారానికే ఈ బడ్జెట్ అని అన్నారు. ప్రజలే కేంద్రంగా రాష్ట్రంలో పాలన కొనసాగుతొందన్నారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో పాటు నిర్ణయాలను గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. సామాజిక న్యాయం, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం అన్నారు.

ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలి: కేసీఆర్

తెలంగాణలో బుధవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం భారాస అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం తెలంగాణ భవన్ లో జరిగింది. ఈ సమావేశానికి ఆ పార్టీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు హాజరయ్యారు. అసెంబ్లీ,మండలిలో అనుసరించాల్సిన వ్యూహం, కార్యాచరణపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న రైతాంగ సమస్యలు, మంచినీటి కొరతపై ఉభయసభల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని ఆ పార్టీ నేతలకు కేసీఆర్ సూచించారు.  

గ్రూప్-2 ఫలితాలు విడుదల

గత ఏడాది డిసెంబర్ లో నిర్వహించిన గ్రూప్-2 పరీక్ష ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. అభ్యర్థుల మార్కులతో పాటు జనరల్ ర్యాంకుల జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులు తమ ఫలితాలను టీజీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్లో చూసుకోవచ్చు.

గ్రూప్-1 ఫలితాలు విడుదల

గత ఏడాది తెలంగాణలో నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. టీజీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్లో అభ్యర్థులు తమ లాగిన్ వివరాలతో మార్కులు చూసుకోవచ్చు.

ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ,ఎస్టీ కోర్టు తీర్పును వెలువరించింది. ఈ కేసులో ఏ2గా ఉన్న నిందితుడు సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. అలాగే మిగిలిన నిందితులకు కోర్టు జీవిత ఖైదును విధించింది.