పొట్టి శ్రీరాములు పేరును మార్చాల్సిన అవసరం ఏముంది?: కేంద్ర మంత్రి బండి సంజయ్
పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును మార్చాల్సిన అవసరం ఏముందని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆదివారం కరీంనగర్ లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని అమరజీవి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం సంఘం వాళ్లు ఏర్పాటు చేసిన అల్పాహార పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరును తొలగించడంపై ఆర్యవైశ్య సంఘాల నాయకులు అభ్యంతరం...
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి
తెలుగు రాష్ట్రాల్లో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ప్రజాప్రతినిధులు, ఆర్యవైశ్య సంఘాల నేతలు పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే పొట్టి శ్రీరాములు త్యాగాన్ని, పోరాట పటిమను గుర్తు చేసుకున్నారు.
గ్రూప్-3 ఫలితాలు విడుదల
గత ఏడాది నిర్వహించిన గ్రూప్-3 పరీక్ష ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది.అభ్యర్థుల మార్కులతోపాటు జనరల్ ర్యాంకుల జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులు తమ ఫలితాలను టీజీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్లో చూసుకోవచ్చు.
రాష్ట్ర వ్యాప్తంగా అంబరాన్నంటిన హోలీ సంబరాలు
తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. ఉదయం నుంచే ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, యువత, మహిళలు, చిన్నాపెద్దా అంతా కలిసి రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకలను జరుపుకున్నారు.
ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక ఏకగ్రీవం
తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం సాయంత్రం 5గంటలకు ముగిసింది. ఐదు స్థానాలకు 5 నామినేషన్లు మాత్రమే దాఖలు కావడంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. కాంగ్రెస్ మూడు స్థానాలు, సీపీఐ ఒక స్థానం, భారాస ఒక స్థానం కైవసం చేసుకున్నాయి. కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ శాసనమండలికి ఎన్నికయ్యారు.
జగదీష్ రెడ్డిని ఉద్దేశపూర్వకంగానే సస్పెండ్ చేశారు: కేటీఆర్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని ఉద్దేశపూర్వకంగానే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని ఆపార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. “ తెలంగాణ రైతాంగం తరుఫున, ఆడబిడ్డల తరుఫున, ఆరు గ్యారంటీల అమలు గురించి ప్రశ్నిస్తే తట్టుకోలేక జగదీష్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభ నుంచి సస్పెండ్ చేసింది. ప్రజల తరఫున శాసనసభలో బీఆర్ఎస్ ఉంటే.. ప్రభుత్వాన్ని...
శాసనసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్
తెలంగాణ శాసనసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు జగదీష్ రెడ్డి సస్పెన్షన్ అమలులో ఉంటుందని స్పీకర్ పేర్కొన్నారు. ఏం జరిగిందంటే..? గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బీఆర్ఎస్ నుంచి జగదీష్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగంలోని పలు అంశాలను ప్రస్తావిస్తూ సర్కారు తీరును తప్పుబట్టారు. ఈ సమయంలో అధికార పక్ష కాంగ్రెస్, భారాస సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో స్పీకర్...
రేపటి నుంచి ఒంటిపూట బడులు
తెలంగాణలో రేపటి నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి. ఈమేరకు విద్యాశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలు పనిచేస్తాయని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అలాగే పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయి. పదవ తరగతి పరీక్షలు జరిగే స్కూళ్లలో మధ్యాహ్నం 1.00 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పాఠశాలలు పనిచేస్తాయని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
డీలిమిటేషన్ పై డీఎంకే సమావేశం…సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం…
నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు వాటిల్లే నష్టాలపై చర్చించేందుకు తలపెట్టిన సమావేశానికి రావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని తమిళనాడు ప్రభుత్వం ఆహ్వానించింది. గురువారం ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తమిళనాడు మంత్రి నెహ్రూ తోపాటు పలువురు ఎంపీలు కలిశారు. డీలిమిటేషన్ పై మార్చి 22న జరిగే సమావేశానికి రావాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సరైన విధానాలు లేకుండా లోక్సభ నియోజకవర్గాల డీలిమిటేషన్ చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని పునరుద్ఘటించారు....